భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ 2015లో నటి గీతా బస్రాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. అనంతరం ఈ ఏడాది జోవన్ వీర్ సింగ్ ప్లాహా అనే బాబు పుట్టాడు. అయితే బాబు పుట్టడానికి ముందు గీతాకు రెండు సార్లు గర్భస్రావం అయిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ప్రతి మహిళ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి ఎప్పెడప్పుడు చిన్నారిని ఎత్తుకొని ముద్దాడాలా అని అనుకుంటుంది. కాని ఆ సమయంలో మిస్ క్యారేజ్(గర్భస్రావం) జరిగితే జీవితమే కోల్పోయినట్లు అనిపిస్తుంది. నా స్నేహితలుతో పాటు నేను దీన్ని అనుభవించాను. హీర్ పుట్టాక రెండు సార్లు గర్భస్రావం అయింది. డిప్రెషన్కి వెళ్లా. ఆ సమయంలో నా భర్త మద్దతు వెల కట్టలేనిది. చాలామంది అనుకొంటారు సెలబ్రిటీలకు ఏముంటుంది? వాళ్ల జీవితం చాలా సాఫీగా గడుస్తుంది అని కానీ కానీ ప్రతి సెలబ్రిటీ జీవితం అంత సులభం కాదు. అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం ఓ పీడకలలా మారుతుంది.
ప్రతికూల పరిస్థితులలో ధైర్యాన్ని కోల్పోకూడదు అని తెలియజేసేందుకు నేను ఈ విషయం చెప్పదలచుకున్నాను. ఎంతో మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు.వారికి ఈ అనుభవం ఎంతో అవసరం అవుతుందని పేర్కొంది గీత బస్రా .ఇటీవల తనకు పుట్టిన కుమారుడికి జోవన్ వీర్ సింగ్ ప్లాహా అనే పేరు పెట్టారు.