ఈ కాలం నాటి స్టార్స్ అందరు సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ నెటిజన్స్కి వినోదం అందిస్తున్నారు. అయితే వీరి అకౌంట్స్ ఒక్కోసారి హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో పలువురు సెలబ్రిటీల హ్యాక్ కావడంతో పాటు తప్పుడు పోస్ట్లు ప్రత్యక్షం అయ్యాయి.
తాజగా ప్రముఖ టీవీ యాంకర్, నటి గాయత్రి భార్గవి సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ హ్యాక్ అయింది. గాయత్రి ఫేస్ బుక్లో పేజ్తో పాటు అకౌంట్ ఉందట. అవి రెండు హ్యాకర్స్ చేతులోకి వెళ్లినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయత్రి ఫిర్యాదును తీసుకున్న ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలా ఫేస్ బుక్ అకౌంట్స్ను తమ అధీనంలోకి తీసుకుని కొందరు హ్యాకర్స్ వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకరమైన సందేశాలను అందులో పోస్ట్ చేస్తున్నారని తెలిపారు
తరచు తమ అకౌంట్స్ హ్యాక్ కాకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు తమ పాస్వర్డ్స్ మారుస్తూ ఉండాలి. అలానే పబ్లిక్ ప్లేస్లలో ఉండే వైఫైలని అస్సలు వాడకూడదు అని సూచిస్తున్నారు. రీసెంట్గా సింగర్ స్మిత అకౌంట్ కూడా ఇలానే హ్యాక్ అయ్యింది. ఖుష్బూ అకౌంట్ కూడా హ్యాక్ కాగా, తన టీం తక్కవ సమయంలోనే మూములు స్థితికి తెచ్చారు.