హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): బ్రిగేడియర్ అజీత్ దేశ్పాండే సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్ సెంటర్ (ఏవోసీ) కమాండెంట్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేజేఎస్ బిందర్ నుంచి ఆయన మర్యాదపూర్వకంగా బ్యాటన్ను తీసుకొని బాధ్యతలు చేపట్టారు. ఏవోసీ సికింద్రాబాద్ సెంటర్ భారత ఆర్మీకి లాజిస్టిక్ సపోర్ట్ అందిస్తున్నది.