జీడిమెట్ల,జూన్ 2 :అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకా రం… రంగారెడ్డి జిల్లాకు చెందిన కేతావత్ రాజు కు నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాగిపేట మారికల్ గ్రామం, సూర్యానాయక్ తండాకు చెందిన సువర్ణతో గత ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. గత ఆరునెలల క్రితం బతుకుదెరువు కోసం నగరంలోని గాజులరామారం డివిజన్, దేవేందర్నగర్ బతుకమ్మబండాకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం పొందుతున్నారు.
కాగా.. సువర్ణ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని నిత్యం అనుమానిస్తుండేవాడు.. ఈ క్రమంలో భార్యతో గొడవపడుతుండేవాడు. లాక్డౌన్ కారణంగా పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. బుధవారం రాత్రి ఇంట్లో మళ్లీ వారి మధ్య గొడవ జరిగి… మద్యం మత్తులో ఉన్న రాజు పారతో భార్య తలపై మోదగా.. అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.