ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన హాట్షాట్స్ యాప్ వ్యవహారంలో ఇటీవల నమోదు చేసిన అశ్లీల చిత్రాల కేసులో మంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు నటి గహనా వశిష్ఠ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయం తెలిసిందే. ఈమెను పోలీసులు పలు కోణాలలో విచారిస్తుండగా, అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు ముంబై పోలీసులపై కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తనను అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే రూ. 15 లక్షలు ఇవ్వాలని ముంబై పోలీసులు అడిగారని గహనా పేర్కొంది. అయితే తాను తప్పు చేయలేదని పోలీసులకి చెప్పగా, వారు ఏ కేసునైన తారుమారు చేస్తాం అని వారు బెదిరించారట. అలానే ఈ కేసులో నిందితులుగా ఉన్న యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ కుమార్ శ్రీవాస్తవ, తన్వీర్ హష్మీలు పోలీసులకి లంచం ఇచ్చేందుకు రూ. 8 లక్షలు సిద్ధం చేసుకున్నారని కూడా గహానా పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో గహనా వశిష్ట్ అరెస్ట్ కాగా, రాజ్ కుంద్రాను పోలీసులు ఈ నెల 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు అరవింద్ శ్రీవాస్తవ అలియాస్ యశ్ థాకూర్.. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబై పోలీసులకు రూ.25 లక్షలు ఇచ్చినట్లు మార్చిలోనే ఏసీబీకి అతడు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ‘మిడ్ డే’ వార్తా సంస్థ పేర్కొంది.