దామెర, జూలై 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని డీఈవో వాసంతి అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఆమె హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం స్కూల్ను పరిశీలించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మొక్కల ఆవశ్యకత తెలుసుకునేలా తీరొక్క మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు వృక్షాలుగా మారితే వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ఇంటి ఆవరణల్లో విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, హెచ్ఎం సత్యనారాయణరెడ్డి, నోడల్ అధికారి రమాదేవి, రజిని, సునీత, రాజేశ్వరి, వాణి, రమేశ్, సీఆర్పీ నరేశ్ పాల్గొన్నారు.
ప్రతి పాఠశాల హరితవనంగా మారాలి
చెన్నారావుపేట: ప్రతి పాఠశాల హరితవనంగా మారాలని మండల స్పెషలాఫీసర్, డీఈవో వాసంతి అన్నారు. మండలంలోని అక్కల్చెడలో డంపింగ్యార్డు, క్రిమిటోరియం, పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం పాఠశాలను సందర్శించి సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో లలిత, ఏపీవో అరుణ, సర్పంచ్ తూటి పావని, కార్యదర్శి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే, మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో పైపులైన్ లీకేజీలకు ఎంపీవో సురేశ్, కార్యదర్శి బాలకిషన్గౌడ్ మరమ్మతులు చేయించారు. అమీనాబాద్ సొసైటీ ఆవరణలో చైర్మన్ మురహరి రవి, డీసీడీబీ బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్ 40 మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెండ్లి మల్లయ్య, డైరెక్టర్లు బండి స్వరూప, భూక్యా హుస్సేన్, మాదారపు నర్సయ్య, అనుముల యాకాంతం, డీ కొమ్మాలు, ఏ శాంతమ్మ, గడ్డల స్వరూప, ఎం ఐలయ్య, ఏ రవి, ఎం వీరారెడ్డి, ఫీల్డాఫీసర్ రమేశ్, సీఈవో ఎన్ ఎల్లయ్య, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
వర్ధన్నపేట/పరకాల/శాయంపేట: గ్రామాల్లో ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లలో మొక్కలను తీసుకెళ్లి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఇల్లందలో గురువారం సీడీపీవో శ్రీదేవి, సర్పంచ్ సుంకరి సాంబయ్య ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. వార్డు సభ్యులు, కార్యదర్శి పాల్గొన్నారు. పరకాల డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ ఇందిరాదేవి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగధిపతి డాక్టర్ జీ ఓదెలు, అధ్యాపకులు ఆర్ కుమారస్వామి, వీ రాజయ్య, ఎం నవీన్, ఎం రవికుమార్, ఎం అరుణ, ఏ అనిల్కుమార్, సుస్మిత, ఈశ్వర్, సంజయ్కుమార్ పాల్గొన్నారు. శాయంపేట మండల వ్యాప్తంగా ఉన్న 24 నర్సరీల్లో నాలుగు లక్షల మొక్కలు పెంచారు. ఈ మేరకు మొక్కలను ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. వసంతాపూర్, సూరంపేట, మైలారం, జోగంపల్లి, నూర్జహాన్పల్లి, సూర్యనాయక్తండా, రాజుపల్లి, నేరేడుపల్లిలో గురువారం మొక్కల పంపిణీ పూర్తయినట్లు ఎంపీవో రంజిత్కుమార్ తెలిపారు.
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ
నెక్కొండ: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అప్పల్రావుపేట జడ్పీఎస్ఎస్ హెచ్ఎం బీ శ్రవణ్కుమార్ అన్నారు. ఉన్నత పాఠశాలలో సర్పంచ్ వడ్డె రజిత-సురేశ్, కార్యదర్శి నరేశ్, గ్రామ ప్రత్యేకాధికారి శ్రీనివాస్తో కలిసి పండ్లు, కూరగాయల మొక్కలు నాటారు. టీఆర్ఎస్ నాయకుడు సురేశ్, కారోబార్ కిరణ్, జీపీ సిబ్బంది మస్తాన్, జక్రియ, సూరయ్య, ఉపాధ్యాయులు యాకయ్య, శ్యాంసుందర్ పాల్గొన్నారు. అలంకానిపేటలో సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మి-రవి ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.