తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నమస్తే సేట్జీ’. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. స్వప్నచౌదరి కథానాయిక. ఈ సినిమా ఫస్ట్లుక్ బుధవారం విడుదలైంది. తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ‘కిరాణా షాప్ నిర్వాహకుల జీవితాల్ని ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. షాప్లను నిర్వహించడానికి సేట్లు పడే కష్టాల్ని ఇందులో చూపిస్తున్నాం. సమాజంలో కనపడని శ్రామికులైన కొన్ని కుటుంబాల కథతో ఆసక్తికరంగా సినిమా ఉంటుంది’ అని తెలిపారు. సంగీతం: వీఆర్ఏ ప్రదీప్, కార్తిక్ కొడకండ్ల.