న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు గరిష్ఠ స్థాయికి చేరుకొన్నదని, అయితే రోజువారీ కేసులు పూర్తిగా దిగువకు రావడానికి జూలై దాకా సమయం పట్టవచ్చని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు. జూలై వరకు కేసులు భారీగానే నమోదవుతాయని అన్నారు. మరోవైపు, దేశంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల వేగం కాస్త తగ్గింది. కొత్తగా నమోదైన కేసులతో పోల్చితే కోలుకొంటున్నవారి సంఖ్య వరుసగా రెండో రోజు పెరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 3,55,338 మంది కోలుకొన్నారు.