తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా నిర్మాతల మండలి ఇటీవల మరణించిన నిర్మాతలకు సంతాప సభ ఏర్పాటు చేసింది. ఈ మధ్య డాక్టర్ ఎం. గంగయ్య గారు , శ్రీమతి కొడాలి అనిత గారు, శ్రీ ఎం.ఎస్. ప్రసాద్ గారు, శ్రీ సి. శ్రీధర్ రెడ్డి గారు (నిర్మాతలు) మరణించారు. వీళ్ల సంతాప సభ ఫిల్మ్ చాంబర్ లో జరిగింది. కాజా సూర్య నారాయణ గారు మాట్లాడుతూ ఈ రోజు ఈ నలుగురు మనతో లేకపోవటం చాలా బాధాకరం .ముఖ్యంగా ఎమ్ స్ ప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు, గంగయ్య గారు మరియు సి.శ్రీధర్ రెడ్డి గారు, కొడాలి అనిత గారు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలి అని వాళ్ళు ఫ్యామిలీస్ కి నా సానుభూతి తెలియచేస్తున్నాను.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ గంగయ్య గారు రాజమండ్రి లో సేవ కార్యక్రమాలు చేసే వారు, ఏ మ్ స్ ప్రసాద్ గారు మంచి మిత్రుడు తను లేకపోవటం తీరని లోటు , సి. శ్రీధర్ రెడ్డి గారు లేకపోవటం తీరని లోటు, కొడాలి అనిత గారు సీరియల్స్ నిర్మించారు తనని కోల్పవటం చాలా బాధాకరమైన విషయం, వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలి అని వీళ్ళ ఫ్యామిలీస్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను. ప్రొడ్యూసర్ మోహన్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈ నలుగురి ఆత్మకు శాంతి చేకురాలి ,అలాగే వీళ్లందరి కుటుంబాలకి నా సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి గారి కుమార్తె మాట్లాడుతూ నా తండ్రిని కోల్పోవటం మా ఫ్యామిలీ కి తీరని లోటు .ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా సంతాప సభ ఏర్పాటు చేయటం గర్వించదగ్గ పరిణామం అలాగే మిగతా ఫ్యామిలీస్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆచంట గోపినాధ్ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఇలాంటి బాధాకరమైన వార్తలు వినకూడదు అని దేవుడిని పార్ధిస్తూ ఈ నలుగురి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అని తెలిపారు.