ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి
ఎస్సై విజయభాస్కర్
పాన్గల్, ఏప్రిల్ 2 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై విజయభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించా రు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్ర త, తరుచుగా శానిటైజర్తో చేతులు శుభ్రపరుచుకోవాలని కోరారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాస్గౌడ్, హెడ్కానిస్టేబుల్ రాంచంద్రయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దగూడెంలో..
వనపర్తి రూరల్, ఏప్రిల్ 2 : మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు తప్పక మాస్కులు ధరించాలని రూరల్ ఎస్సై షేక్షఫీ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దగూడెం గ్రామంలో కరోనా వైరస్ తీవ్రతపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు బయటికి వచ్చే సమయంలో తప్పక మాస్కు ధరించాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.