సిద్ధార్థ్, జీవీ ప్రకాష్కుమార్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకుడు. కశ్మీర పరదేశి, లిజోమోల్జోస్ కథానాయికలు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్.బాలాజీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిత్ర టీజర్ గ్లింప్స్ను శుక్రవారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్కుమార్ల నటన పోటాపోటీగా సాగుతుంది. ఫస్ట్లుక్కు మంచి స్పందన లభిస్తోంది. టీజర్ కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్, సంగీతం: సిద్ధూ కుమార్, నిర్మాణ సంస్థ: అభిషేక్ ఫిలిమ్స్, దర్శకుడు: శశి.