భారత ప్రఖ్యాత అథ్లెట్ మిల్కా సింగ్ 91 ఏళ్ల వయస్సులో కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి 11.30కు మిల్కా సింగ్ మరణించినట్లు ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు.ఆయన మృతి దేశం మొత్తాన్ని విషాదంలో నింపింది. సినీ రాజకీయ సాధారణ ప్రజలంతా కూడా మిల్కా సింగ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈక్రమంలో ఈయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసి హిట్ కొట్టిన ఫర్హాన్ అక్తర్ ఎమోషనల్ అయ్యారు.
మిల్కా సింగ్ జీవిత నేపథ్యంలో బాగ్ మిల్కా బాగ్ అనే సినిమా చేశారు ఫర్హన్. ఇప్పుడు ఆయన మృతికి ఎమోషనల్ అవుతూ.. మీరు లేరనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. నా లోలోపల ఏదో అవుతుంది. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. నిజం ఏంటంటే మీరెప్పుడు ప్రాణాలతోనే ఉంటారు. నాన్నగా, స్నేహితుడిగా మీతో ఉన్న వాళ్లందరిని ఆనందింపజేశారు. మీరెంతో స్పూర్తి దాయకం అంటూ ఫర్హాన్ కామెంట్ చేశారు.
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. మీ మరణం నాకెంతో మనస్థాపం కలిగించింది. మీ నష్టం పూడ్చలేనింది. మీరు అథ్లెట్స్కి స్పూర్తివంతంగా ఉంటారు అని మహేష్ స్పష్టం చేశారు.
మిల్కా సింగ్ మరణ వార్త చాలా హృదయ విదారకం. స్వాతంత్ర్యం తర్వాత ఎలా నడుచుకోవాలో చూపించారు. మీరు రాబోయే తరాలకు స్పూర్తి. మా హీరో మీరు. దేశం మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. మీ జీవితం నుండి ఎంతో మంది ప్రేరణ పొందుతారు అని బాలయ్య తన పోస్ట్లో పేర్కొన్నారు.