నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20 : జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వేతీరును పరిశీలించారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని 24వ వార్డులో కొనసాగుతున్న జ్వర సర్వేను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని, మెడికల్ కిట్లు అందజేసి, మందులు వాడేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జ్వర సర్వే చేస్తున్న వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, 24వ వార్డు కౌన్సిలర్ రాము, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ పవన్, రంగన్న, రహమాన్ పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్, ఫత్తేపూర్ గ్రామాల్లో నిర్వహించిన సర్వేను తహసీల్దార్ లక్ష్మణ్ పరిశీలించారు. సర్పంచులు లక్ష్మి, సవిత, టీఆర్ఎస్ నాయకులు గణేశ్, లింబాద్రి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్, గోన్గొప్పుల గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను జడ్పీసీఈవో గోవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్న ప్రతిఒక్కరి వివరాలను వైద్యసిబ్బంది సేకరించాలన్నారు. లక్షణాలు ఉన్న వారందరికీ మెడికల్ కిట్లను అందజేయాలని అన్నారు. ఎంపీడీవో రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్, ధర్మోరా గ్రామాల్లో నిర్వహించిన రెండో విడుత ఇంటింటి సర్వేను తహసీల్దార్ శ్రీధర్ పరిశీలించారు. లాక్డౌన్ అమలులో ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా బయటికి రావొద్దని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచులు రాజేశ్వర్, కత్తి లావణ్యముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. మెండోరా మండలంలోని పోచంపాడ్, దూదిగాం గ్రామాల్లో నిర్వహించిన సర్వేను ఎంపీడీవో సంతోష్కుమార్ పరిశీలించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మిస్బా, శ్రీనివాస్, ఉపసర్పంచ్ సతీశ్, శ్రీనివాస్, కార్యదర్శి భోజన్న, రఘు, ఆశవర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏర్గట్లతోపాటు మండలంలోని బట్టాపూర్, తొర్తి, నాగేంద్రనగర్, గుమ్మిర్యాల్, దోంచంద, తాళ్లరాంపూర్ గ్రామాల్లో నిర్వహించిన జ్వర సర్వేను మండల ప్రత్యేకాధికారి ఏడీఏ మల్లయ్య, ఎంపీడీవో రాజేశ్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మధు, ఆయాగ్రామాల సర్పంచులు నవీన్, భీమనాతి భానుప్రసాద్, పద్మ, మంజులాగౌడ్, రాధ, ఎంపీవో శివచరణ్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గాంధీనగర్ తండాను జిల్లా అదనపు కలెక్టర్ లత సందర్శించారు. జ్వర సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా లక్షణాలున్న వారిని ఎంతమందిని గుర్తించారని సర్వే బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంట రూరల్ వైస్ ఎంపీపీ సాయిలు, సర్పంచ్ అనూష, కార్యదర్శి వెంకటేశ్, ఉపసర్పంచ్ గురువయ్య, అంగన్వాడీ టీచర్ ఇందిర ఉన్నారు.
డిచ్పల్లి మండలం దూస్గాం, మిట్టాపల్లి గ్రామాల్లో చేపట్టిన జ్వర సర్వేను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, మండల ప్రత్యేకాధికారి బదావత్ చందర్నాయక్ పరిశీలించారు. గ్రామంలో నర్సరీ, జ్వర సర్వే, ఉపాధిహామీ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మండలంలోని అమృతాపూర్, బర్ధిపూర్ గ్రామాల్లో సర్వేను ఎంపీడీవో సురేందర్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కొరట్పల్లి, సుద్దపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను తహసీల్దార్ శ్రీనివాస్రావు, ముల్లంగి, కమలాపూర్ గ్రామాల్లో కొసాగుతున్న సర్వేను ఎంపీవో రామకృష్ణ పరిశీలించారు. కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో జ్వర సర్వేను మండల నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, జడ్పీటీసీ శంకర్పటేల్ పరిశీలించారు. ఎక్లాస్పూర్ సర్పంచ్ గంగాధర్, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మోపాల్ మండలం మంచిప్ప, న్యాల్కల్, సిర్పూర్ గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వేను ఆర్డీవో రవి, తహసీల్దార్ వీర్సింగ్ పరిశీలించారు. స్వయంగా ఇండ్లకు వెళ్లి మాట్లాడారు. వారి వెంట ఆర్ఐ సంతోష్రెడ్డి, సర్పంచులు ప్రసాద్, ముత్యంరెడ్డి, సిద్ధార్థ, వైద్య సిబ్బంది, అధికారులు ఉన్నారు. వర్ని మండలం చిలుక తండా, కోకల్దాస్ తండా, అంతాపూర్ తండా, సైద్పూర్, శంకోర, కూనీపూర్, పైడిమల్, మల్లారం గ్రామాల్లో సర్వే నిర్వహించగా.. మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో చందర్ పర్యవేక్షించారు. జక్రాన్పల్లి మండలంలో కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వేను ఎంపీపీ డీకొండ హరిత, మండల ప్రత్యేకాధికారిణి వెంకటలక్ష్మి పరిశీలించారు. కొలిప్యాక్ గ్రామంలో చేపట్టిన సర్వేను ఎంపీపీ, బ్రాహ్మణపల్లిలో ప్రత్యేక అధికారిణి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రుద్రూర్ మండలంలోని రాయకూర్, అంబం గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను తహసీల్దార్ ముజీబ్ పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేశారు.
మోస్రాలో కొనసాగుతున్న సర్వేను జిల్లా కొవిడ్ నోడల్ ఆఫీసర్ రవిగౌడ్ పరిశీలించారు. చందూర్ మండల కేంద్రంలో జ్వర సర్వేను బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పరిశీలించారు. ముప్కాల్లో పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్, రెంజర్లలో ఉప సర్పంచ్ మోహన్, నల్లూర్లో హెల్త్ సూపర్వైజర్ మారుతి ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బందితో కలిసి జ్వర సర్వే నిర్వహించారు. ఆశ కార్యకర్తలు అమృత, అనిత, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు అమీనా బేగం, జ్యోతి, వరలక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని రాకాసీపేట్లో నిర్వహించిన జ్వరసర్వేను మున్సిపల్ కమిషనర్ రామలింగం పరిశీలించారు. ఇంటింటి సర్వేకు వస్తున్న బృందాలకు సహకరించాలని ప్రజలను ఆయన కోరారు. ఏఈ శివకృష్ణ, సర్వే బృందం అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.