తెలంగాణ ముద్దుబిడ్డ, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవ లు ఎనలేనివి. రాష్ట్ర రాజకీయాల్లో, జాతీయ రాజకీయా ల్లో ప్రత్యేకమైన ముద్రను వేశారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని సంక్షో భం నుంచి బయట పడేయడమే కాకుండా వినూత్నమై న, విప్లవాత్మకమైన విధానాలతో అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని అమలు చేసిన ఘనత ఆయన సొంతం. భారత్ ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా నిలబడటానికి పీవీ ఆనాడు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల సరళీకరణ, సంస్కరణలే కారణమంటే అతిశయోక్తి కాదు. దేశ అభ్యున్నతికి పాటుపడిన పీవీ నరసింహారావును ఆధునిక భారతదేశ పితామహుడిగా వినుతికెక్కారు. అయినప్పటికీ జాతీయ పార్టీలైన బీజేపీ, అటు సొంత పార్టీయై న కాంగ్రెస్ ఏనాడూ పీవీ సేవలను గుర్తించలేదు. చివరకు పీవీ మృతి చెందిన సందర్భంలోనూ ఢిల్లీలో అంతిమ సంస్కారాలకు అవకాశమివ్వకపోవడం శోచనీయం.
వారసురాలికి పట్టం..
ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీకి ఘన నివాళి అర్పిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణతో ఆగకుండా పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి సహృదయతను చాటుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవీని నిలిపారు. స్వతహా గా విద్యావేత్త, చిత్రకారిణి కావడంతో పాటు పీవీ కుమార్తె కావడంతో సబ్బండ వర్గాల పట్టభద్రులు ఆమెను ఆదరించారు. పీవీకి ఘనమైన నివాళి అర్పించారు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వాణీదేవీకి మద్దతుగా ఓట్లు వేసి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీపై చెదరని అభిమానాన్ని చాటుకున్నారు. జాతీయ పార్టీల చెంప చెల్లుమనేలా వాణీదేవిని గెలిపించి శాసన మండలికి పంపాయి.
ఎలుగెత్తి చాటిన కేసీఆర్..
మహనీయుడి చరిత్ర మరుగునపడిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ ఖ్యాతిని ఎలుగెత్తిచాటారు. 2014 తెలంగాణా ప్రత్యేక రాష్ర్టావతరణం నుంచి పీవీ గారి జయంతి, వర్ధంతి సభలు అధికారికంగా నిర్వహిస్తూ సముచిత స్థానం కల్పించారు. ఒక వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరుపెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. దేశ ప్రధానిగా, స్వాతంత్య్ర సమర యోధునిగా, విద్యావేత్తగా, సాహితీ వేత్తగా, ఆర్థి క సంస్కరణల ధీశాలిగా, అపర చాణుక్యునిగా, పరిణతి గల రాజ నీతిజ్ఞునిగా బహుముఖీన ప్రతిభలతో వెలుగొందిని పీవీ ఔన్నత్యాన్ని నలుదిశలా తెలియజేసేందుకు శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించేందుకు సంకల్పించారు. జూన్ 28వ తేదీన పీవీ జ్ఞానభూమిలో ఈ వేడుకలను ముఖ్యమం త్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించగా, నేటికీ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. పీవీకి భారతరత్న పురస్కారం అందించాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇటీవలనే వరంగల్, కరీంనగర్, వంగర, ఢిల్లీ తెలంగాణా భవన్లలో పీవీ కాంస్య విగ్రహాలను ఏర్పా టు చేయడానికి రూ.35 లక్షలను మంజూరు చేశారు.