సీనియర్ సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్జీ(86) కరోనాతో గురువారం రాత్రి కన్నుమూశారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో తొమ్మిది వందలకుపైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్గా పనిచేశారాయన. మోహన్జీ అసలు పేరు మాదిరెడ్డి కృష్ణమోహన్రావు. సోదరుడు జగన్తో కలిసి స్టిల్ఫొటోగ్రాఫర్గా తన కెరీర్ను ఆరంభించారు మోహన్జీ. దివంగత అగ్ర నటుడు ఎన్టీఆర్ నటించిన ‘కాడేద్దులు ఎకరం నేల’చిత్రంతో ఈ సోదరద్వయం సినీ ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావుతో వీరికి చక్కటి అనుబంధముంది. ‘తాతామనవడు’ నుంచి ‘ఒరేయ్రిక్షా’వరకు దాసరితో కలిసి మోహన్జీ పనిచేశారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్బాబు, కృష్ణ, జెమినిగణేషన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, రాజ్కుమార్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు మోహన్జీ స్టిల్ ఫొటోగ్రాఫర్గా వ్యవహరించారు. మోహన్జీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.