మాయదారి కరోనా ఎందరినో పొట్టన పెట్టుకుంటుంది. సాఫీగా సాగుతున్న పరిస్థితులలో కరోనా అనే మహమ్మారి ఎవరికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కబళిస్తుంది. కరోనా నుండి తప్పించుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రముఖులు కరోనాతో కాలం చేస్తున్నారు. తాజాగా శ్రీ కలైమమని పట్రాయని సంగీత రావు 101 సంవత్సరాల వయసులో కరోనా బారినపడి చెన్నై లో పరమపదించారు.
కలైమమని పట్రాయని ఘంటసాల గురువు పుత్రుడు. ఆయనకు సహాయ సంగీత దర్శకుడిగా కూడా పని చేశారు. ఎన్నో కూచిపూడి నృత్యనాటకాలకు సంగీతం సమకూర్చారు. వెంపటి చిన సత్యం చాలా కార్యక్రమాలకు కూడా సంగీతం అందించారు. కలైమమని పట్రాయని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.