ముంబై ,జూన్ 6:ముంబై: డిజిటల్ చెల్లింపు కంపెనీ పేటీఎం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల మీదే ఆధారపడినా కూడా పేటీఎం మాత్రం నష్టాలబాట పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయంలో 10 శాతం మేర క్షీణత కనిపించింది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను పేటీఎం యాజమాన్యం విడుదల చేసింది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు దీన్ని పంపించింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎం సంస్థకు 1,704 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 10 శాతం మేర తక్కువగా ప్రాఫిట్ను నమోదు చేసింది పేటీఎం.