యాదాద్రి, మే4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంతగల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
స్వామివారికి శాస్ర్తోక్తంగా నిత్యపూజలు
బాలాలయం ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసిఅర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. ప్రతి రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు పరిమితి సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలలయం ముఖ మండపంలో భక్తులను అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతును నిర్వహించారు. కరోనా వైరస్ నశింపజేసి, ప్రజలను కాపాడాలని పలువురు లక్ష్మీనరసింహస్వామి మాలధారణ గావించిన స్వాములు స్వామివారిని కోరారు. యాదాద్రీశుడిని దర్శించుకుని పూజలు చేశారు.
ఆదాయం రూ. 3,11,374
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు రూ. 3,11,374 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 9,364, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 3,300, క్యారీబ్యాగుల ద్వా రా రూ. 450, వ్రతాల ద్వారా రూ. 1,500, కల్యాణకట్ట ద్వారా రూ. 3,300, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 51,800, శాశ్వతపూజల ద్వారా రూ. 6,000, వాహనపూజల ద్వారా రూ. 1,900, టోల్గేట్ ద్వారా రూ. 310, సువర్ణపుష్పార్చన ద్వారా రూ.8,240, యాదరుషి నిలయం ద్వారా రూ. 7,100, పాతగుట్ట ద్వారా రూ. 2,8 80, కొబ్బరికాయల విక్రయాల ద్వారా రూ. 9,510, ఇత ర విభాగాలు రూ.2,05,320లతో కలిపి రూ. 3,11,374 ఆదాయం లభించిందని ఆమె తెలిపారు.