వెండితెరపైన , బుల్లితెరపైన సత్తా చూపగల నటుడు జూనియర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ షో కార్యక్రమంతో తన సత్తా ఏంటో చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నాడు. స్టార్ మా కోసం నాగార్జున , చిరంజీవిలు మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో షో ను నిర్వహించగా.. తాజాగా జెమిని టీవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ గత కొద్ది రోజులుగా సందడి చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ తాజాగా షో ఎప్పుడు, ఏ సమయానికి ప్రారంభం అవుతుందో చెప్పశాడు.ఆగస్ట్ 22న షో ప్రారంభం కానున్నట్టు వీడియో ద్వారా తెలియజేసిన ఎన్టీఆర్ సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 8.30ల నుండి ప్రసారం కానుందని తెలియజేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 15 నుండి మొదలు కానుందని అందరు ఊహించగా, ఓ వారం తర్వాత షోని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షో తో బుల్లితెర ప్రేక్షకులని సైతం ఎన్టీఆర్ అలరించనున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింంగ్ ప్రస్తుతం ఉక్రెయిన్లో జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక కొరటాల శివతో కలిసి సినిమా చేయనున్నాడు.