తెలుగు సినీ పరిశ్రమలో ఎఫెక్ట్స్ రాజుగా సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. అట్లూరి శ్రీనివాస్ నిర్మాత. గోపికృష్ణ, ప్రియాంక జంటగా నటించారు.నిర్మాణానంతర పనులను పూ ర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మా ట్లాడుతూ ‘1990లో జరిగిన యదార్థ సం ఘటన ఆధారంగా, గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుదనే నమ్మకం వుంది’ అన్నారు.