గ్లామర్ తళుకులతో పాటు చక్కటి నటనను కనబరుస్తూ తెలుగు, తమిళ భాషల్లో అచిరకాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిపోయింది నిధి అగర్వాల్. తెలుగులో ‘ఇస్మార్ట్శంకర్’తో తొలి కమర్షియల్ సక్సెస్ను అందుకున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో భారీ అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం పవన్కల్యాణ్, దర్శకుడు క్రిష్ కలయికలో రూపొందుతున్న ‘హరిహరవీరమల్లు’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది నిధి అగర్వాల్. త్వరలో ఈ ముద్దుగుమ్మ మహేష్బాబుతో జోడీకట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే కోలీవుడ్లో ‘భూమి’, ‘ఈశ్వరన్’ చిత్రాల్లో అందచందాలతో మెప్పించింది. తమిళంలో కొత్త కథలు వింటున్నానని నిధి అగర్వాల్ చెబుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా లభించిన ఈ విరామంలో కొత్త ఫొటో షూట్లతో కనువిందుచేస్తోంది. బార్బీడాల్ మాదిరిగా తళుకులీనుతున్న ఈ సుందరి తాజా ఫొటోషూట్ సోషల్మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.