ఈ రోజుల్లో థియేటర్స్ ఓపెన్ చేసి అక్కడ తమ సినిమాను విడుదల చేయాలంటే నిర్మాతలకు చాలా టైమ్ పడుతుంది. అందుకే చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఎంచక్కా మంచి రేట్ వస్తే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు యూవీ క్రియేషన్ సహ సంస్థ అయిన యూవీ కాన్సెప్ట్ కూడా ఇదే చేసింది. తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఏక్ మినీ కథ సినిమాను బంపర్ ఆఫర్కు ఓటీటీకి అమ్మేసింది.
పేపర్ బాయ్ ఫేమ్ సంతోశ్ శోభన్ హీరోగా, కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ఏక్ మినీ కథ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా కరోనా కారణంగా కుదర్లేదు. ఇదే సమయంలో మంచి రేటు రావడంతో ఈ సినిమాను ఓటీటీకి అమ్మేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను దాదాపు రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమాను దాని బడ్జెట్ కంటే డబుల్ రేటు ఇచ్చి అమెజాన్ తీసుకుంది. దీన్ని అమెజాన్ ఒరిజినల్స్ కింద విడుదల చేయబోతున్నారు. ఏదేమైనా ఈ సినిమాకు కనీసం 5 కోట్లు మిగులుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైరల్
డబ్బు కోసం నన్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్
మీ అసాధారణ సహకారానికి సాటిలేదు : మహేశ్బాబు
ఎన్టీఆర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన చిరంజీవి
చనిపోయినట్టు ప్రచారం.. ఖండించిన శక్తిమాన్ నటుడు
సమంత శీర్షాసనం.. వైరల్గా మారిన వీడియో
కరోనా నుండి కోలుకున్న అల్లు అర్జున్
ఓటీటీలో నితిన్ చిత్రం.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
కరోనాతో నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత