చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపుతుంది. గత 23 రోజులుగా 12 మంది సినీ ప్రముఖులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు. వాళ్ల నుంచి కీలక సమాచారం రాబట్టారు. తాజాగా ఈడి ముందు సినీ ప్రముఖుల విచారణ ముగిసింది. సెప్టెంబర్ 22న హీరో తరుణ్ చివరగా విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కీలకమైన సమాచారం అందుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ అధికారులు. దాదాపు 8 గంటల పాటు ఈ విచారణ జరిగింది. అందులో ఆయన కాల్ డేటాను కూడా పరిశీలించారు అధికారులు.
మనీ లాండరింగ్ కు సంబంధించిన విషయం కూడా తరుణ్ ను అడిగినట్లు తెలుస్తోంది. దాంతో పాటు టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood drugs case) కు సంబంధించిన కీలకమైన ప్రశ్నల సమాహారం తరుణ్ (Tarun) ముందు ఉంచారు. అన్నింటికీ తరుణ్ తడబడకుండా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఇప్పటికే పూరీ జగన్నాథ్ సహా మరికొందరికి క్లీన్ చీట్ ఇచ్చారు అధికారులు. టాలీవుడ్ నుంచి రవితేజ, పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, తనీష్ సహా 12 మంది విచారణకు హాజరయ్యారు.
ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు వరసగా సినీ ప్రముఖులు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ 23 రోజుల్లో ఒక్కొక్క సినీ ప్రముఖుడిని దాదాపు 5 నుంచి 8 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమకు తగిన సమాచారం వచ్చేవరకు విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి తెలియజేయనున్నారు ఈడీ అధికారులు.
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!