కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురు సెలబ్రిటీను ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేపట్టిన విచారణ చివరిదశకు వచ్చేసింది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజ, నవదీప్ను విచారించగా, నేడు తరుణ్ ని విచారించబోతున్నారు.
కొద్ది సేపటి క్రితం తరుణ్ ఈడీ ఆఫీసుకి చేరకోగా, ఆయనను డ్రగ్స్ కి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు విచారించనున్నారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై తరుణ్ ను ఈడీ ప్రశ్నించనున్నారు. 2017 లో ఎక్సైజ్ శాఖ విచారణ ఎదుర్కొన్నాడు తరుణ్.
2017 జూలై 19 స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో షాంపుల్స్ ఇచ్చాడు తరుణ్. తరుణ్ ఇచ్చిన బయో షాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రీపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.