ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బడా విజయం సాధించిన దృశ్యం. ఈ చిత్రానికి సీక్వెల్గా దృశ్యం 2 తెరకెక్కించారు. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. రాజమౌళి వంట దిగ్గజ దర్శకుడు సైతం ఈ చిత్రాన్ని చూసి నివ్వెరబోయారు. దృశ్యం 2ను మలిచిన తీరుకు ముగ్దుడై దర్శకుడైన జీతూ జోసెఫ్ను వ్యక్తిగతంగా ప్రశంసించారు.
దృశ్యం 2 చిత్రం ఇప్పుడు తెలుగులోను రీమేక్ అవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త మాధ్యమాలలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డ్ సాధించి వార్తలలోకి ఎక్కింది. ఐఎండీబీ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా దృశ్యం 2 రికార్డులకెక్కింది. అన్ని వయస్సుకు సంబంధించి వారు, అంతర్జాతీయ ప్రేక్షకులు ఇలా అన్నింటిని లెక్కలు కడితే 8.8 రేటింగ్తో దూసుకుపోయింది. చిత్రంలో మోహన్ లాల్, మీనా నటన ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.