జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం దృశ్యం. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం నాలుగు భాషలలో రీమేక్ అయింది. తెలుగుతో పాటు కన్నడం..తమిళం.. హిందీ లో రీమేక్ కాగా, అన్నింటా మంచి విజయం సాధించింది. మధ్య తరగతి కుటుంబంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ సమస్యను ఆ కుటుంబం ఎలా సాల్వ్ చేసుకుంటుంది అనే కోణంలో ఈ మూవీ తెరకెక్కింది.
వాస్తవికంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. అవార్డులతో పాటు రివార్డులు కూడా ఈ మూవీకి లభించాయి. ఇప్పుడు ఈ సినిమాని ఇండోనేషియా భాషలో తెరకెక్కించబోతున్నారట. అయితే ఇండోనేషియాలో94 శాతం మంది బహాసా ఇండోనేషియా అనే భాష మాట్లాడతారు. 300 శాతం మందికి జవానీస్( జావా) అనేది ప్రాథమిక భాష. ఈ క్రమంలో చిత్రాన్ని ఏ భాషలో తెరకెక్కిస్తారన్నది తెలియాల్సి ఉంది.
దృశ్యం చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. దృశ్యం 2 ని ఇప్పుడు వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. ఆయన సరసన మీనా కథానాయికగా నటించింది.త్వరలోనే ఈ సినిమాని థియేటర్స్లో విడుదల చేయనున్నారు.