కుటుంబ అనుబంధాలు, థ్రిల్లర్ అంశాల నేపథ్యంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్గా రూపొందిస్తున్న ‘దృశ్యం-2’ చిత్రీకరణ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది. వెంకటేష్, మీనా, నదియ, నరేష్, కృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీతూజోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని.. క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ లభించిందని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు డి.సురేష్బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్కుమార్ సేతుపతి తెలిపారు. తొలిభాగం మాదిరిగానే ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు అనుక్షణం ఉత్కంఠగా అనిపించే థ్రిల్లింగ్ అంశాలతో సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ కురూప్, సంగీతం: అనూప్రూబెన్స్, దర్శకుడు: జీతూ జోసెఫ్.