కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్స్ ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో సురేష్ బాబు బడా నిర్మాతలు కూడా తమ సినిమాలని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. నారప్ప చిత్రాన్ని ఇప్పటికే ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా, విరాట పర్వం కూడా ఓటీటీలోనే విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇవే కాక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, టక్ జగదీష్ వంటి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుదల అవుతాయి అంటూ ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ప్రచారాలపై స్పందించిన టక్ జగదీష్ టీం నానా సినిమా రిలీజ్కు సంబంధించిన రూమర్స్ నమ్మోద్దని పేర్కొన్నారు. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము. ఎటువంటి ప్రచారాలను నమ్మకండి. మాతో కనెక్ట్ అయి ఉండండి. త్వరలోనే బాక్సాఫీస్ను టక్ చేయబోతున్నాం’ అని నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘టక్ జగదీష్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. నరేష్, జగపతిబాబు, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.