మార్కెట్ చైర్పర్సన్ సుధారాణి, ఎంపీపీ జ్యోతి
నడిగూడెం/అనంతగిరి : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణి, ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు అన్నారు. గురువారం మండలంలోని నారాయణపురం, సిరిపురం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు నాగేందర్రెడ్డి, లక్ష్మీవీణ, వీరస్వామి, ఎంపీటీసీలు గార్లపాటి మానస, శెట్టి జ్యోతి, ఉప సర్పంచ్ శెట్టి సతీశ్, ఏఓ రాజగోపాల్, రామలక్ష్మి, గురుమూర్తి, సాంబయ్య, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంతగిరి మండల కేంద్రంలో ఐకేపీ కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుధారాణి ప్రారంభించారు. క్రార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ ఉమాశ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గింజకూ మద్దతు ధర
కోదాడ రూరల్ : రైతులు పండించిన ప్రతి గింజకూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని ఎంపీపీ చింతా కవితారెడ్డి అన్నారు. మండలంలోని గుడిబండ, రెడ్లకుంట, కొమరబండ, కూచిపూడి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణి, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రామారావు, సంపెట ఉపేందర్గౌడ్, ఏడీఏ వాసు, ఏఓ పాలెం రజిని తదితరులు పాల్గొన్నారు.
హేమ్లాతండాలో..
మేళ్లచెర్వు : రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ కొట్టె పద్మావతి సూచించారు. మండలంలోని హేమ్లాతండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మావతి, ఎంపీడీఓ ఇసాక్హుస్సేన్, సర్పంచ్ భిక్షం, ఏఓ పెద్ది శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు టీకం, మంగమ్మ, ఏపీఎం విజయ్, సీసీ కృష్ణమోహన్ పాల్గొన్నారు.హుజూర్నగర్ రూరల్ : మండలంలోని బూరుగడ్డలో కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ఏఈఓ స్వర్ణ, సర్పంచ్ షేక్ సలీమా, ఎంపీటీసీలు చీకూరి రాజా, మచ్చా వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ఆదెమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య, సింగిల్విండో డైరెక్టర్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
కోదాడటౌన్ : పట్టణంలోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణి, ఎంపీపీ చింతా కవితారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, సహకార సంఘం చైర్మన్ ఆవుల రామారావు, వైస్ చైర్మన్ బుడిగం నరేశ్, ఏడీఏ వాసు, వెంపటి పద్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
చింతలపాలెం : మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ వేములూరి రంగాచారి ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘం సీఈఓ బాబూరావు, పీఏసీఎస్ వైస్ ప్రెసిడెంట్ రిజ్వానా, ఏఈఓలు రియాజ్, సంధ్య, మార్కెటింగ్ డైరెక్టర్ మతీన్, సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.
పాలకవీడు : మండలంలోని శూన్యంపహాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేరేడుచర్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ శంకర్నాయక్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నరీనాయక్, సీసీ జైతురాం పాల్గొన్నారు.
నేరేడుచర్ల : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని పెంచికల్దిన్నె పీఎసీఎస్ చైర్మన్ శాఖమూరి శ్రీకాంత్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎంపీటీసీ లింగయ్య, సంఘం వైస్ చైర్మన్ శ్రీను, మాజీ చైర్మన్ మురళి, ఉప సర్పంచ్ వెంకటి, డైరెక్టర్లు నారాయణ, భుజంగరావు, మాజీ డైరెక్టర్ సత్యం, సీఈఓ వెంకన్న పాల్గొన్నారు.
చిలుకూరు : మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ అల్సకాని జనార్దన్, సర్పంచ్ కొడారు బాబు, ఎంపీటీసీ బెల్లంకొండ రమణానాగయ్య, వడ్డేపల్లి కళ్యాణీకోటేశ్, ఏఓ శ్రీనివాస్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్బాబు, మాజీ జడ్పీటీసీ శివాజీనాయక్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
కరోనా వ్యాక్సిన్పై అపోహలు వద్దు
నాసా కాంటెస్ట్లో బుడతడి ప్రతిభ