తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు అన్నాత్తె. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ గతేడాది డిసెంబర్ లో రజినీకాంత్ అస్వస్థతకు లోను కావడంతో నిలిచిపోయింది. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్న రజినీ..ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఫిల్మ్స్టూడియోలో కొనసాగుతుంది.
రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు డాక్టర్ల బృందం అన్నాత్తె సెట్స్ కు వచ్చిందట. కరోనా కేసులు పెరగడం, ఎండతీవ్రత పెరిగిపోవడంతో రజినీ కోసం మేకర్స్ స్పెషల్గా డాక్టర్లను నియమించినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. అన్నాత్తె చిత్రంలో నయనతార, కీర్తిసురేశ్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి..
పాపం పవర్ స్టార్ను ఎవరూ పట్టించుకోవడం లేదట!