బీబీనగర్, మే 29 : మండల కేంద్రంలోని శ్రీఎం ల్యాబ్స్ యాజమాన్యం సహకారంతో జిల్లా స్త్రీ శిశువు సంక్షేమ శాఖ స్థాయీ చైర్మన్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ ఆధ్వర్యంలో బీబీనగర్, కొండమడుగు సీహెచ్సీలు, గ్రామ పంచాయతీలకు పీపీఈ కిట్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు ప్రసాద్, ఎండీ అక్బర్, దస్తగిరి, నారగోని మహేశ్, గోళి సంతోష్రెడ్డి, ఎలుగల నరేందర్, పొట్ట అంజి, ఎండీమస్తాన్, వైద్యులు దాక్షాయని, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.