టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఫ్యాషన్ బ్రాండ్ ‘రౌడీ యూ’ గురువారం (జులై 15వ తేదీ)తో మూడేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రౌడీ బ్రాండ్ కు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ ఫ్యాషన్ బ్రాండ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. రౌడీ యూ బ్రాండ్ ను విజయ్ దేవరకొండ రాబోయే కాలంలో బాలీవుడ్ కు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడట.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే తన బిజినెస్ ను విస్తరించే ప్లాన్ ను అప్లయి చేయాలని ఫిక్స్ అయ్యాడట విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ స్టార్ హీరో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న లైగర్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే లైగర్ నుంచి విడుదలైన స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. లైగర్ విడుదలయ్యాక విజయ్ దేవరకొండ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరడం ఖాయమని ధీమాగా ఉన్నారు అభిమానులు.
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!