అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను అలరించిన అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) జయంతి నేడు. 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది శ్రీదేవి. దుబాయ్ (Dubai) లో శ్రీదేవి ఆకస్మిక మరణంతో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవగా..ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోయి శ్రీదేవి చనిపోయిందని అక్కడి పోలీసులు నిర్దారించారు.
ఆ టైంలో శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి..సీనియర్ హీరోయిన్లలో అత్యధికం రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా కొనసాగుతుంది. అయితే శ్రీదేవి చనిపోయే వరకు ఆమెకున్న ఆస్తుల విలువ (Properties Worth) కు సంబంధించిన న్యూస్ ఒకటి అటు బీటౌన్ లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం..శ్రీదేవి, బోనీకపూర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు (శ్రీదేవి చనిపోయేనాటికి). ఈ ఇద్దరికి మూడు పెద్ద ప్రాపర్టీలతోపాటు కొన్ని లగ్జరీ కార్లు ఇతర పెట్టుబడులున్నాయి.
శ్రీదేవి తన కూతురు జాన్వీకపూర్ ను సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చూడాలని కలలు కనేది. దురదృష్ణవశాత్తు జాన్వీకపూర్ నటించిన తొలి సినిమా దఢక్ చూడకముందే శ్రీదేవి తుదిశ్వాస విడిచింది. శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తోంది జాన్వీకపూర్. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా ఎంట్రీకి రెడీ అవుతోంది.
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్