తెలకపల్లి, మే 25 : కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండలంలోని అనంతసాగర్లో కరోనా బాధితులకు మంగళవారం నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. వైరస్ సోకిన మొదటి దశలో గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన జ్వరసర్వేతో కొంతమేర కరోనా కట్టడి సాధ్యమైందని వివరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకే ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ పెట్టారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని కోరారు. కరోనా కష్టకాలంలో పేదలకు ఎంజేఆర్ ట్రస్టు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, మాజీ జెడ్పీటీసీ నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, సర్పంచ్ విష్ణు, టీఆర్ఎస్ నాయకులు బంగారయ్య, కోట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.