సౌతాంప్టన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ రెండవ ఇన్నింగ్స్లో అతను 13 పరుగులకే నిష్క్రమించాడు. కైల్ జేమిసన్ మరో సారి తన బౌలింగ్ లైన్తో కోహ్లీని ఇబ్బందిపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లోనూ కోహ్లీని జేమిసన్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ స్టంప్ అవతల లూజ్ షాట్ ఆడిన కోహ్లీ తన వికెట్ను సమర్పించుకున్నాడు. దీంతో ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో మూడు వికెట్లకు 72 రన్స్ చేసింది. పుజారా, రహానేలు క్రీజ్లో ఉన్నారు.