లైగర్ సినిమా షూటింగ్లో భాగంగా పూరీ జగన్నాథ్ ఇటీవల ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్, గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా, నిశ్శబ్దం మూవీ డైరెక్టర్ హేమంత్ మధుకర్.. పూరీతో మీటింగ్ పెట్టారు. నలుగురు దర్శకులు ఒక చోట కలిసి మీటింగ్ పెట్టడంతో అభిమానులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి.
ఈ పిక్ని నటి, నిర్మాత చార్మి కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ దర్శకులు ఏం మాట్లాడుకుంటున్నారో గేస్ చేయమని తన అభిమానులను అడిగారు. వీరు తమ సినిమాల గురించి ముచ్చటించుకుంటున్నారా లేదంటే కలిసి పెద్ద పాన్ ఇండియా సినిమా గురించి చర్చిస్తున్నారా అని అడుగుతున్నారు. లేదంటే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం ఛార్మినే ఇవ్వాలి . ప్రస్తుతం పూరి జగన్నాథ్.. లైగర సినిమాతో బిజీగా ఉండగా, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ,అనన్య పాండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. మోహన్ రాజా .. లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు. ఇక క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ విడుదలకి సిద్దమవుతుండగా, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక హేమంత్ మధుకర్ కొత్త ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉన్నారు.