తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు వినాయక్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే తన స్థాయి ఏంటో చూపిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో వినాయక్ తన మార్క్ సినిమా ఒక్కటి కూడా చేయలేదు. మూడేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. 2018 ఫిబ్రవరిలో విడుదలైన సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. మధ్యలో శీనయ్య అనే సినిమాతో హీరోగా మారినా.. దాన్ని మధ్యలోనే ఆపేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కించే బాధ్యత తీసుకున్నాడు వినాయక్. ఈ సినిమా లాంచింగ్ హైదరాబాద్లో జరిగింది. దీనికి ఒరిజినల్ ఛత్రపతి సినిమాను తెరకెక్కించిన రాజమౌళి.. ఆ సినిమా కథ రాసిన విజయేంద్రప్రసాద్ హాజరయ్యారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఇక్కడే దర్శకుడు వినాయక్ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఒక హీరోను రెండు భాషల్లో ఒక్కరే పరిచయం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయంలో వినాయక్ చేసి చూపిస్తున్నాడు.
తెలుగులో బెల్లంకొండ వారసుడిని పరిచయం చేసింది వినాయక్నే. 2014లో అల్లుడు శీనుతో పరిచయం చేశాడు. ఆ సినిమా పర్లేదు అనిపించింది. ఇప్పుడు అదే హీరోను హిందీలో మళ్లీ పరిచయం చేసే బాధ్యతను కూడా ఆయనే తీసుకున్నాడు. ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఫిజికల్గా చాలా మారిపోయాడు. ఆ క్యారెక్టర్ కోసం కండలు పెంచాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏదైనా ఒక హీరోను రెండు భాషల్లో ఒకే దర్శకుడు పరిచయం చేయడం అనేది చాలా చాలా అరుదుగా జరిగే విషయం. దాన్ని చేసి చూపించాడు దర్శకుడు వినాయక్. మరి ఛత్రపతి హిందీ రీమేక్తో బెల్లంకొండ వారసుడు బాలీవుడ్లో ఎంత వరకు తన సత్తా చూపిస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలుగు ఇండస్ట్రీకి మరో తమిళ హీరో.. 20 కోట్ల రెమ్యునరేషన్
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
Bigg boss | బిగ్ బాస్ అప్డేట్.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా ?
ఒకే ఒక్కడు రేంజ్లో చరణ్-శంకర్ మూవీ..!
ప్రకాశ్ రాజ్కు విజన్ ఉంది,అందుకే సపోర్ట్ చేస్తున్నాను: నాగబాబు