భోపాల్ : మధ్యప్రదేశ్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా ఆ రాష్ట్ర రాజధాని భోపాల్తోపాటు ఇండోర్ నగరాల్లో ప్రభుత్వం రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కర్ఫ్యూ సమయం, ఎంతకాలం ఈ ఉత్తర్వులు అమలులో ఉండనున్నది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన లేదు.
ఈ రెండు నగరాల్లో మినహా రాష్ట్రంలోని జబల్పూర్, గ్వాలియర్, ఉజ్జయిని, రట్లాం, ఛింద్వారా, బుర్హాన్పూర్ తదితర నగరాల్లో రాత్రి 10 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంది. హోలీ వేడుకలు, పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పండుగను విడివిడిగా జరుపుకోవాలని సూచించింది. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారంపాటు ఐసోలేషన్లో ఉంచుతున్నారు.