కామారెడ్డి టౌన్/ ఎల్లారెడ్డి, మే 6: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తిరునగరి శ్రీకాంత్, ఆయన కూతురు హిమలేఖ్య ఏప్రిల్ 30న ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని (టాంజానియా పర్వతం గిల్మన్స్ 5,685 మీటర్ల పాయింట్) అధిరోహించారు. ఈ సందర్భంగా పర్వతారోహకులకు హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం అభినందన లేఖ పంపించారు. అరుదైన ఘనత సాధించిన తండ్రీ కూతుళ్లు తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు.