జయరామ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘హింట్ ?’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ క్రియేషన్స్ మైత్రి రెడ్డి, రిజ్వాన్ అహ్మద్ నిర్మిస్తున్నారు. చందూ బిజుగ దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా హీరో జయరామ్ తేజ మాట్లాడుతూ..‘ప్రస్తుతం టీవీ సీరియల్స్లో హీరోగా నటిస్తున్నాను. ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. దర్శకుడు చందూ బిజుగ మాట్లాడుతూ..‘15 ఏండ్లు టీవీ ఇండస్ట్రీలో దర్శకుడిగా పనిచేశాను. నిర్మాత మైత్రి రెడ్డి ఇచ్చిన కథకు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాం’అన్నారు.