కార్తిక్రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన పాత్రల్లో తేజస్వి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పునఃప్రారంభమైంది. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే హారర్ చిత్రమిది. గ్రాఫిక్స్కు ప్రాధాన్యముంటుంది. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం’ అని తెలిపారు. ఓ చిన్నారి జీవితం చుట్టూ తిరిగే కథ ఇదని హీరో కార్తిక్రాజు చెప్పారు. ఇందులో తాను హీరోయిన్ తండ్రి పాత్ర చేస్తున్నట్లు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు అన్నారు. పోసాని కృష్ణమురళి, దేవిప్రసాద్, ఆమని ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘంటశాల విశ్వనాథ్.