మోడల్గా వైకుంఠధామం
అభివృద్ధి పనుల్లో ముందంజ..
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
రామన్నపేట, మార్చి 31 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. పల్లెల ప్రగతిపైనే దేశాభివృద్ధి ముడిపడి ఉన్నది. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలిస్తున్నది. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. పల్లెల ప్రగతిపైనే దేశాభివృద్ధి ముడిపడి ఉన్నది. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలిస్తున్నది. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. పల్లెప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఆదర్శంగా నిలిచింది రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామం. గ్రామంలో రూ.12.60 లక్షల వ్యయంతో వైకుంఠధామం, 2.60 లక్షలతో డంపింగ్ యార్డు, వర్మీకంపోస్ట్షెడ్ రూ.6లక్షల అంచనాతో చేపట్టిన పల్లెప్రకృతి వనం పనులు త్వరితగతిన పూర్తిచేశారు.
మోడల్గా వైకుంఠధామం..
గ్రామంలోని ప్రభుత్వ భూమిలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం నిర్మాణ పనులు 2019 మే నాటికి పూర్తయ్యాయి. జిల్లా లో నిర్మా ణం పూర్తయిన మొదటి వైకుంఠధామంగా రికార్డు సాధించింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా అధునాతన వసతులతో కూడిన బాత్రూంలు, వెయిటింగ్హాల్, రెండు బర్నింగ్ ప్లాట్ఫారాలు, రెండు దింపుడు కల్లాలు, ప్రహరీని నిర్మించారు. నిర్మాణప్రదేశం మధ్యలో ఉన్న బండరాళ్లను తొలగించి మైదానం చదును చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి ట్రీగార్డ్లను ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి వైకుంఠధామం వరకు గ్రామపంచాయతీ నిధులతో మట్టి రోడ్డును వేయించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో ప్రత్యేక విద్యుత్లైన్ వేసి లైటింగ్ను ఏర్పాటు చేశారు. బోరువేసి మోటారును బిగించారు. వాటి చుట్టూ ఇనుప కంచెలతో ప్రహరీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు తోడుగా గ్రామ పంచాయతీ నుంచి మరికొన్ని నిధులను ఖర్చు చేసి మోడల్ వైకుంఠధామంగా నిర్మించారు.
అభివృద్ధి పనుల్లో ముందంజ..
గ్రామంలో వైకుంఠధామంతోపాటు పల్లెప్రగతిలో చేపట్టిన డంపింగ్ యార్డ్, వర్మీకంపోస్ట్షెడ్, పల్లెప్రకృతి వనం పనులు పూర్తయ్యాయి. పల్లెప్రగతి పనులను ఒకే ప్రదేశంలో నిర్మించడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. గ్రామ నర్సరీని అక్కడే ఏర్పాటు చేశారు. వీటికి తోడు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్, 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులతో పారిశుధ్యం మెరుగుపర్చడానికి ప్రధాన వీధుల్లో రూ.10లక్షలతో నాలుగు మురుగు కాలువల నిర్మించారు. వీధిదీపాల నిర్వహణను మెరుగుపర్చారు. కాలనీల్లో గుంతలను పూడ్చడానికి మొరం పోయించారు. ప్రస్తుతం 20లక్షల వ్యయంతో ఇంటింటికీ మిషన్భగీరథ నీటిని అందించే లక్ష్యంతో పైప్లైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
వసతులు మెరుగుపడ్డాయి..
పల్లెప్రగతి పనులతో గ్రామం లో వసతులు బాగా మెరుగుపడ్డాయి. ముఖ్యంగా వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, గ్రామనర్సరీ ఒకే చోట ఉండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కల్పించారు. అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి.
అందరి సహకారంతో అభివృద్ధి
స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు అధికారులు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పల్లెప్రగతి పనులకు సంబంధించిన బిల్లులు పూర్తిగా రానప్పటికీ పనులను ఆపలేదు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం.
-రేఖ యాదయ్య, సర్పంచ్, జనంపల్లి
ఇవి కూడా చుడండి
హైదరాబాద్ పోలీసుల కొవిడ్ అవగాహన కార్యక్రమం
విటమిన్ డి మనకు ఎందుకు అవసరమంటే..?