పాకిస్తాన్లోని పెషావర్లో 1922లో జన్మించిన నటుడు దిలీప్ కుమార్. ఈయన అసలు పేరు యూసుఫ్ ఖాన్. పరిస్థితుల నేపథ్యంలో భారత్కు వచ్చి మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన దిలీప్ కుమార్ శుక్రవారం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ముంబైలోని హిందూజా ఆసుపత్రికి వెళ్లారు. దిలీప్ ఆసుపత్రికి వెళ్లాడనే సరికి అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన దిలీప్ సతీమణి .. అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దని అన్నారు.
దిలీప్ కుమార్ శరీరంలో కొన్ని అవయవాలు సరిగా పని చేయని కారణంగా వైద్యులు పరీక్షల కోసం అడ్మిట్ చేయమని సూచించారు. ఆసుపత్రిలో రెండు రోజులు ఉంచి అన్ని పరీక్షలు చేసిన తర్వాత, అతని ఆరోగ్యం బాగుందని, ఇంటికి వెళ్లొచ్చని చెప్పారు. మీ అందరి ప్రార్ధనలతో దిలీప్ క్షేమంగా ఉన్నారని సైరా భాను పేర్కొంది. 97 ఏళ్ల దిలీప్ కుమార్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెలిసిందే. కాగా, దిలీప్ కుమర్ ఈ నెలలో కోవిడ్ -19 సంక్షోభం వలన అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998 లో ‘ఖిలా’లో కనిపించారు.