బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్( 98) కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడిన దిలీప్ కుమార్కు హిందూజా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం కొంత కుదుట పడడంతో డిశ్చార్జ్ చేశారు.
అందరి ప్రేమాభిమానాలు, ప్రార్థన వల్ల దిలీప్ సాబ్ కోలుకుని ఇంటికి వచ్చేశారు. భగవంతుడి ఆశీస్సులతో పాటు డాక్టర్ గోఖలే, డాక్టర్ పార్కర్, డాక్టర్ అరుణ్ షా కృషితో ఆయన ఇంటికి వచ్చారు’ అని దిలీప్ కుమార్ టీం తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కాగా, ఈ నెల 6న జరిపిన వైద్య పరీక్షలో ఆయన బైలేటరల్ ప్లూరల్ ఎఫ్యూజన్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది.