తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేశారు. ఇక ఇన్నాళ్లు అటకెక్కిన ప్రాజెక్టులు ఇప్పుడు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే నిర్మాత మండలి ఆదేశాల ప్రకారం షూటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కనీసం ఒక్క డోస్ అయిన వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పడంతో దిల్ రాజు.. తన ప్రొడక్షన్ లో తన సినిమాల కోసం పనిచేసే సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది , ఆఫీస్ స్టాఫ్ అందరికి కోవిడ్ వాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేసాడు.
హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్న దిల్ రాజు సుమరాఉ 200 మందికి వాక్సినేషన్ ఇప్పించినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ తమ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే సిబ్బందికి తామే వాక్సిన్ ఇప్పిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దిల్ రాజు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో రాంచరణ్ 15వ సినిమాని నిర్మించడంతో పాటు హిందీలో జెర్సీ రీమేక్.. తెలుగులోశాకుంతలం సినిమాలను నిర్మిస్తున్నాడు.