గద్వాల టౌన్, ఏప్రిల్ 10 : తాటి ముం జలు కలుషితం లేని దివ్య ఔషధం. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే తాటి ముంజ లు ఇప్పుడు పట్టణాల్లోనూ దర్శనమిస్తున్నా యి. డజను రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. అయినా పోషకాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొనుగోళ్లు చేసేందు కు ముందుకు వస్తున్నారు. దీంతో అమ్మకం అంతకంతకూ పెరుగుతున్నది. వేసవికాలం లో భానుడి తాపం తీర్చుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతుంటారు. అనేక రకాల పండ్ల రసాలు, కూల్డ్రింక్స్ సేవిస్తుంటారు.
ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు కూడా తీసుకుంటారు. ఇందులో మనకు మొదటగా గుర్తు వచ్చేవి తాటిముంజలు. వీటినే ఐస్ ఆపిల్స్ అని కూడా అంటారు. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులో ఉండే తాటి ముంజలపై ప్రజలు మక్కువ చూపుతారు. గతంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రమే వీటి రుచిని ఆస్వాదించేవారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా విక్రయిస్తున్నారు. తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.
అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ బీ, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాలిన గాయాలకు, దద్దుర్లకు, మచ్చలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. బరువును తగ్గించేందుకు ఎంతో దోహదపడతాయి. చిన్నపిల్లలకు వచ్చే ఆటలమ్మ వ్యాధి నివారించడంలోనూ పనిచేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తాయి. జీర్ణ సమస్యను మెరుగుపరుస్తుంది.
తాటి ముంజల్లో ఉన్న పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. చల్లదనం లభిస్తుంది. దాహార్తిని తగ్గిస్తుంది. వేసవికాలంలో వీటికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విక్రయదారులు ప్రధాన కూడళ్లలో ముంజలను విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీటినని కొనేందుకు ప్రజలు గుమిగూడుతున్నారు.