కైరో: సూయజ్ కాల్వలో గతనెలలో చిక్కుకున్న భారీ సరుకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. రూ.7,500 కోట్లు (100 కోట్ల డాలర్లు) పరిహారం చెల్లించాలని ‘ఎవర్ గివెన్’ నిర్వహణ సంస్థను ఆదేశించింది. వాణిజ్య పరంగా భారీ నష్టం కలిగించినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత నెల 23న సూయజ్ కాల్వలో ఎవర్గివెన్ ప్రమాదవశాత్తు అడ్డం తిరగడంతో వారంపాటు రవాణా స్తంభించిపోయిన విషయం తెలిసిందే.