కొన్ని ప్రేమ, పెళ్లిళ్లు సినిమాటిక్లో జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి కూడా ఒకటి ఈ జోడి పెళ్లి చేసుకొని 16 ఏళ్లు గడిచిపోయింది. అయితే ఐశ్వర్య తన భార్య కావడం వెనుక ఓ విచిత్రమైన స్టోరీ ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ధనుష్.
ధనుష్ తొలుత ‘తుల్లువాదో ఇలమై’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ధనుష్. ఇందులో ధనుష్ని చూసి ఇతనేం హీరో అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘కాదల్ కొండెన్’ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా ధనుష్కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. చాలా మంది ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. ఐశ్వర్య కూడా అతని నటనపై ప్రశంసలు కురిపిస్తూ ఒక బొకే పంపింది. దానిమీద కంగ్రాచ్యులేషన్స్ కీప్ ఇన్ టచ్ అని రాసి ఉంది.
ఇది జరిగిన కొద్ది రోజులకు ధనుష్,ఐశ్వర్యలు కాఫీ షాప్లో కలిసారు. ఇది మీడియా కంట పడడంతో ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది అని వార్తలు రాసారు. అయితే వీరిద్దరి జంట బాగుందని భావించిన ఇంటి పెద్దలు వారిద్దరికి పెళ్లి చేశారు. కాఫీ షాప్లో కలిసిన నెల రోజులకే మా పెళ్లైంది. నాతో పెళ్లికి ఐశ్వర్య ఒప్పుకుంటుందనుకోలేదు. ఏదేమైనా కూడా ఒక కాఫీ షాప్ లో కలిసి కనిపించినందుకు తమ ఇద్దరి పెళ్లి అయిపోయిందంటూ ఈ స్టోరీ అంత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ధనుష్.