కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మల్టీలింగ్యువల్ గా వస్తున్న ఈ ప్రాజెక్టు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఈ క్రేజీ కాంబినేషన్ ఒక్క చోట చేరింది. తాజాగా ధనుష్ హైదరాబాద్లో డైరెక్టర్ శేఖర్ కమ్ములతోపాటు మేకర్స్ నారాయణ్దాస్ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, పీ రామ్మోహన్ లను కలిశాడు. సినిమాకు సంబంధించిన పలు విషయాలను చర్చించారు.
ఈ ఏడాది తర్వాత ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు శేఖర్ కమ్ముల ప్రాజెక్టులో భాగస్వామ్యం కానున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లవ్స్టోరీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో వాయిదా పడ్డది.
క్లాస్-మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే స్టామినా ఉన్న యాక్టర్ ధనుష్. ఈ సారి శేఖర్ కమ్ములతో చేయబోయే చిత్రం పొలిటికల్ టచ్తో సాగనుందని అనుకుంటున్నారు సినీ జనాలు. దీనిపై మరో అప్డేట్ వస్తే క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్