ఇన్నాళ్లు తమిళ హీరోలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. కాని ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ త్వరలో వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతుండగా, విజయ్ సేతుపతి కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఇక నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్.. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నట్టు రీసెంట్గా ప్రకటించారు.
తాజా ప్రకటనపై స్పందించిన ధనుష్.. “నిజంగా శేఖర్ కమ్ముల గారితో సినిమా చెయ్యడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని అలాగే నిర్మాతలు నరాంగ్ నారాయణ దాస్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు గార్లతో కలిసి వర్క్ చేస్తుండడం కూడా సంతోషంగా ఉందని తెలిపి , త్రిభాషా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని” ధనుష్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ మూవీ షూటింగ్లో భాగంగా అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే.